భజన గాయకుడు వినోద్‌ అగర్వాల్‌ మృతి

లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రముఖ భజన గాయకుడు వినోద్‌ అగర్వాల్‌ కన్నుమూశారు. రాధాకృష్ణులపై పాడిన గీతాలు, భజనలతో ఆయన బాగా ప్రాచుర్యం పొందారు. మంగళవారం ఉదయం ఆయన యూపీలోని మధురలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వృందావన్‌లో తన కుటుంబ సభ్యులతో పాటు ఉంటున్న వినోద్‌ అగర్వాల్‌ వయసు 63 ఏళ్లు. 1955, జూన్‌ 6న ఢిల్లీలో జన్మించారు. 1962లో ఆయన తల్లిదండ్రులు ముంబైకి వలసవచ్చారు. వినోద్‌ తన 12వ ఏటనుంచే భజన గీతాలు పాడటం ప్రారంభించారు. ఆయన పాడిన పాటలు విదేశాల్లోనూ ఎంతో ఆదరణ చూరగొన్నాయి. రాధాకృష్ణులపై వినోద్‌ పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి.