భర్తను చంపి.. సూట్కేసులో కుక్కి
చండీగఢ్: దంపతుల మధ్య గొడవతో భర్తను అతి దారుణంగా చంపేసిందో మహిళ. అనంతరం అతడి మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి దాచిపెట్టింది. ఈ దారుణమైన ఘటన పంజాబ్లోని మొహాలీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మొహాలీకి చెందిన ఎకమ్ సింగ్ దిల్లాన్, అతడి భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో దిల్లాన్ భార్య.. ఆమె సోదరుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి.. సమీపంలోని కెనాల్లో పడేసేందుకు యత్నించింది. సూట్కేసును కారులోకి ఎక్కించేందుకు ఓ ఆటోడ్రైవర్ను సాయం కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సూట్కేసును తీసుకెళ్లేప్పుడు ఆ డ్రైవర్ చేతికి రక్తం అంటుకోవడంతో అతడు పోలీసులకు సమాచారమందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కారులోని సూట్కేసులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దిల్లాన్ భార్యను అరెస్టు చేశారు. సోదరుడు, మరో స్నేహితుడితో కలిసి తన భర్తను హత్య చేసినట్లు దిల్లాన్ భార్య విచారణలో చెప్పింది. కాగా.. మృతుడి భార్య కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు మేనకోడలు కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.