భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

విజయనగరం,జూలై22(జ‌నంసాక్షి): భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో భవన కార్మికుల సంఘం సోమవారం ర్యాలీ ని చేపట్టింది. వెంకటేశ్వర డీలక్స్‌ సెంటర్‌ నుంచి బోస్‌ బమ్మ సెంటర్‌ వరకు భవన నిర్మాణ కార్మికులంతా ర్యాలీ గా సాగి, మానవహారాన్ని చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఇసుక రీచ్ల ను తక్షణమే ఇవ్వాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ.. తహశీల్దార్‌ ఎంవై నాయుడు కి, భవన కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు.