భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

రాజస్థాన్‌: దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం కోరలు చాస్తోందని గుజరాత్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన మరుసటి రోజే.. రాజస్థాన్‌లో భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ప్లూతో మరణించారు. కిల్వారా జిల్లా మంగలగఢ్‌ నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తికుమారి శ్వాసక్రియలో ఇబ్బంది కారణంగా ఆదివారం ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీకాంత్‌స్వామి తెలిపారు. కీర్తి కుమారి మృతికి ప్రధాని నరేంద్రమోదీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజె సంతాపం తెలిపారు.