భాజాపావి కేవలం మాటలే

కాంగ్రెస్ లో కరెంట్ కోతలే

ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్

బిచ్కుంద అక్టోబర్ (జనంసాక్షి) భాజాపావి కేవలం మాటలే అని, కాంగ్రెస్ లో ప్రజలకు కేవలం కరెంట్ కోతలే మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసి వంద పడకల ఆస్పత్రిగా మార్చిన సందర్భంగా నూతన భవన శంకుస్థాపనకు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సభలో పాల్గొని మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఆపరేషన్ థియేటర్లు త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూ కెసిఆర్ గారి అధ్యక్షతన సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేశారని అందులో భాగంగానే బిచ్కుంద మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇకనుంచి ఆసుపత్రిలో డాక్టర్ల సమస్య లేకుండా అన్ని రకాల వైద్య వసతులు అందే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పటేల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్,జిల్లా పరిషత్ చైర్మన్ దపేదర్ శోభ రాజు, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, జుక్కల్ నియోజకవర్గం ఎంపీపీలు జడ్పిటిసిలు ఎంపిటిసిలు సర్పంచ్లు పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మండల ప్రజలు పాల్గొన్నారు.