భానుడి భగభగకు తెలంగాణ విలవిల

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని ఖాలీగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలతో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో 43 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండలో 42 డిగ్రీలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.