‘భారతమాతకు వెన్నుపోటు పొడిచారు’
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి క్లీన్చిట్ ఇచ్చిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని వివరించారు. మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మోదీ ఏం రహస్య ఒప్పందం చేసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు ప్రధాని వివరణ ఇవ్వాల్సి ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.