భారత్‌కు చేరుకున్న మోడీ

poyjvd4bప్రధాని నరేంద్రమోడీ ఐదు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. యూకే పర్యటనలో భాగంగా తొలి మూడు రోజులు బ్రిటన్‌లో పర్యటించిన ప్రధాని.. చివరి రెండు రోజులు టర్కీలో గడిపారు. ఆది, సోమవారాల్లో అంటాల్యా నగరంలో జరిగిన జీ-ట్వంటీ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఉగ్రవాద సమస్యను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అటు భారత్ లో పెట్టుబడి అవకాశాలు, నల్లధనం వెలికితీతకు అంతర్జాతీయ సహకారం, పర్యావరణ మార్పులు తదితర అంశాలపై ప్రధాని ప్రసంగించారు. వివిధ దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పర్యటన ముగించుకుని ఈ తెల్లవారుజామున రెండు గంటలకు భారత్ కు చేరుకున్నారు.