భారత్‌ కు రానున్న సర్తాజ్‌ అజీజ్‌

16_07_2016-sartazazizpakపాకిస్తాన్‌ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్‌ నెలలో జరిగే హార్ట్‌ ఆఫ్‌ ఆసియా సదస్సులో పాల్గొనడానికి ఆయన వెళ్లనున్నారు. తన పర్యటన ఒక సదవకాశమని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించడానికి ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. హార్ట్‌ ఆఫ్‌ ఆసియా సదస్సు అమృత్‌సర్‌లో డిసెంబర్‌ 3వ తేదీన జరుగనున్నది. గత సెప్టెంబర్‌ 10 జరిగిన యురి దాడి తరువాత పాకిస్తాన్‌కు చెందిన ఒక సీనియర్‌ అధికారి భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.