భారత్-నేపాల్ సరిహద్దులో భూకంపం
భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతం దార్చులాలో గడిచిన రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఉత్తరాఖండ్లోని చంపావత్, శ్రీనగర్ గర్హ్వాల్, నైనిటాల్, ఉదమ్సింగ్ నగర్, ఆల్మోరాలో ప్రాంతాల్లో ప్రకంపనలు చెలరేగాయి. కాగా ఈ ఉదయం 4.12 గంటలకు సైతం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్స్కేల్పై తీవ్రత 3.3గా నమోదైంది. ఈ ప్రభావంతో హిమాచల్ప్రదేశ్లోని కులు ప్రాంతం ప్రభావానికి గురైంది.