భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, మూడు మోటార్ బైక్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మావోయిస్టులకు ఎప్పుడెప్పుడు ఏ వస్తువులు సరఫరా చేస్తున్నారన్న అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.