భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

1

భారత స్టాక్ మార్కెట్లు జూలు విదిల్చాయి. జనవరిలో చివరి రోజు ట్రేడింగ్ లో భారీ లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 401 పాయింట్లు లాభపడి 24,870 దగ్గర ముగిసింది. నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో 7,563 దగ్గర క్లోజయ్యింది. డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ 68 రూపాయల దిగువకు చేరింది. రూ. 67.89 దగ్గర కొనసాగుతోంది. మొదట స్వల్పంగా నష్టాలతో మొదలైన మార్కెట్లు తర్వాత కోలుకొని లాభాలబాట పట్టడం విశేషం.