భారీ వర్షాలకు ఢిల్లీలో ట్రాఫిక్‌ జామ్‌

న్యూఢిల్లీ : భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గుర్‌గావ్‌ ప్రాంతంలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, ఆ మార్గంవైపు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 12 గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 48వ జాతీయ రహదారిపై వాహనాలు కదలడం లేదు. ఢిల్లీలో జైపూర్‌ హైవే జామ్‌ అయింది. గుర్‌గావ్‌లో విద్యా సంస్థలు మూసివేశారు. మరోవైపు భారీ వర్షాలకు యమునా నిది ఉప్పొంగుతోంది.