భువనేశ్వర్లో కూలిన ఫ్లైఓవర్
భువనేశ్వర్ ,సెప్టెంబర్ 10,(జనంసాక్షి):భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలింది. రద్దీ ప్రదేశంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మందికి పైగా గాయపడ్డారు. భువనేశ్వర్ లోని బొమికల్ ప్రాంతంలో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీం?ఘటన స్థలానికి చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.