భూమా బ్రహ్మానందరెడ్డికి మోడీ గ్రీటింగ్స్‌

న్యూఢిల్లీ,ఆగస్టు28  : నంద్యాల ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచిన భూమాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘నంద్యాల ఉప ఎన్నికలో ఘన విజయాన్ని అందుకున్న భూమా బ్రహ్మానందరెడ్డి గారు, ఎన్డీయే మిత్ర పక్షమైన టీడీపీకి శుభాకాంక్షలు’ అని మోడీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీ ట్వీట్‌ చేయడంపై భూమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.