మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముందు మధ్యాహ్నం భోజన కార్మికుల నిరసన

మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముందు మధ్యాహ్నం భోజన కార్మికుల నిరసన

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 9. (జనంసాక్షి). సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలు సోమవారం 20 వ రోజుకు చేరుకున్నాయి. ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్షా శిబిరం నుండి మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు