మంత్రి గన్‌మెన్‌ ఆత్మహత్య

తిరువనంతపురం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టీ థామస్‌ గన్‌మెన్‌

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుజిత్‌ (28) కొల్లాం జిల్లా కడకల్‌ గ్రామంలోని తన ఇంట్లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తల, చేతుల మణికట్టుపై గాయాలతో ఉన్న సుజిత్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి మాథ్యూ టీ థామస్‌ దగ్గర 3 నెలలుగా భద్రతా అధికారిగా పనిచేస్తున్న సుజిత్‌ బ్యాచిలర్‌ అని, అతని ఇంట్లో సూసైడ్‌ నోటు దొరికిందని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుజిత్‌ సెలవులో ఉండగా ఈ ఘటన జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.