మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన మంత్రి అల్లోల
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన మంత్రి అల్లోల
నిర్మల్ బ్యూరో, అక్టోబరు13,జనంసాక్షి,, రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అనంతరం నిర్వహించిన మంజులమ్మ అంతిమయాత్రలో మంత్రి పాల్గొన్నారు.