మంత్రి మల్లా రెడ్డిని ఒడిస్తాం -వజ్రేష్ యాదవ్

మంత్రి మల్లా రెడ్డిని ఒడిస్తాం -వజ్రేష్ యాదవ్

మేడ్చల్ : నేను లోకల్.. మంత్రి మల్లారెడ్డి నాన్ లోకల్ అని మేడ్చల్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి మండల కాంగ్రేస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. మేడ్చల్ లో కాంగ్రేస్ అభ్యర్థి అయిన తనను చూస్తే భయం చుట్టుకుందని, అందుకే గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎంత ఖర్చు పెట్టినా బడుగు బలహీన వర్గానికి చెందిన తననే ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని వజ్రేష్ యాదవ్ తెలిపారు. తను గెలుపొందిన వెంటనే నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడిన మల్లారెడ్డి అక్రమాలను బయటపెట్టి జైలుకు పంపడం ఖాయమని వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి,నక్క ప్రభాకర్ గౌడ్, రాపోలు రాములు,మండల అధ్యక్షుడు రమణ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కౌన్సిలర్ల సాయిపేట శ్రీనివాస్, చాప రాజు,నాయకులు రాఘవేందర్ గౌడ్,బల్ రెడ్డి,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.