మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు

 

 

 

 

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెనాలిలోని ఆయన నివాసం నుంచి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు యడ్లపాటి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు.

ఎమ్మెల్యేలు కరణం బలరాం,అన్నాబత్తుని శివకుమార్‌, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి, కామినేని శ్రీనివాస్‌, ధూళిపాళ్ల తో పాటు టీడీపీ నాయకులు పలువురు పాల్గొని నివాళులు అర్పించారు.