మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం.

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు అన్నారు.ఇందులో భాగంగా 27న బుధవారం తాండూరు నియోజకవర్గంలో పెద్దఎతున్న రూ౹౹ 50కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థా పనలు మరియు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ముఖ్యఅతిథులుగా ఆర్ధిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్ర రెడ్డి,సమాచార పౌర సంబంధాల ,భూగర్భా గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొనన్నున్నారని ఈ సందర్భంగా రూ. 10.23కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంకు శంకుస్థాపన చేయానున్నారని.రూ. 25కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్.రూ.10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులు.రూ. 1.50కోటితో తాండూరు లైబ్రరీ నూతన భవనానికిశంకుస్థాపన.పట్టంలోని శాంతినగర్ లోని ఈ-సేవా భవనంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ ను ప్రారంభించడం జరుగుతుందని. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనన్నున్నారు .అనంతరం పట్టణంలోని విలియమూన్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగు తుందని.కావున మంత్రుల పర్యటను విజయ వంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.