మంథనిలో రామరాజ్యం కావాలంటే శ్రీధర్ బాబును గెలిపించాలి

మంథనిలో రామరాజ్యం కావాలంటే శ్రీధర్ బాబును గెలిపించాలి

జనంసాక్షి, కమాన్ పూర్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో రామరాజ్యం రావాలంటే ఎమ్మెల్యేగా దుదిల్ల శ్రీధర్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గాండ్ల మోహన్, రంగు సత్యనారాయణ గౌడ్ లు అన్నారు. కమాన్పూర్ మండల ప్రజలు బాబు ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలను ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కమాన్పూర్ లో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మికి సంబంధించిన లబ్ధిదారులను అధికార పార్టీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. కమాన్పూర్ జెడ్పిటిసిగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు.
కమాన్పూర్ మండల ప్రజలు చైతన్యవంతులు అని, ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సయ్యద్ అన్వర్, బొంపెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్, ఇరుగురాల శేఖర్, గడ్డం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కుక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అప్సర్, నాగారం మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు, మైనార్టీ సెల్ సెక్రెటరీ సయ్యద్ ఇక్బాల్, పెంచికల్పేట్ ఉపసర్పంచ్ లింగాల కుమార్, సీనియర్ నాయకులు బొజ్జ సతీష్, దెబ్బేట రాజ నర్సయ్య, పల్లె కనకయ్య మల్యాల రాజేష్, ఇరుగురాల రాజు చిప్పకుర్తి చంద్రయ్య, చిప్పకుర్తి కనకయ్య, సాగర్ల కొమురయ్య, చాగంటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.