మందలించిన ఉపాధ్యాయుడిపై దాడి

కాకినాడ,జూలై23(జ‌నంసాక్షి): తరుచూ నలుగురిలో మందలిస్తున్నాడనే అవమానంతో ఓ యువకుడు ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై  విన్సెంట్‌ అనే యువకుడు సోమవారం అర్ధరాత్రిదాటక కత్తితో దాడిచేశాడు. అనంతరం పోలీసులకు నిందితుడు లొంగిపోయాడు. తనను తరచూ నలుగురిలో మందలిస్తుండడంతో అవమానం భరించలేక దాడిచేశానని ఆ  యువకుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.