మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు
ఖమ్మం,నవంబర్21 (జనం సాక్షి) : నేలకొండపల్లి మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. ఇక్కడి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా, మక్కల డిమాండ్ ఉన్నందున ఆఓలచన చేస్తునామని అన్నారు.ఈ మేరకు మార్కెట్లో కొనుగోలు చేయాలని అధికారులను కోరనునట్లు తెలిపారు. మార్కెట్కు కోదాడ, చింతకాని మండలానికి చెందిన రైతులు కూడా పత్తిని అమ్ముకునేందుకు వస్తున్నారని, రైతులు మార్కెట్లోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పత్తిని కొనుగోలు చేసిన ఘనత నేలకొండపల్లి మార్కెట్కు దక్కుతుందని తెలిపారు. మార్కెట్ పరిధిలో ఉన్న కూసుమంచి మండలంలోని పలు గ్రామాలను కూడా మార్కెట్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.