మక్కాలో ఘోర ప్రమాదం

5

క్రేన్‌ కూలి 60 మందికి పైగా మృతి

సౌదీ అరేబియా:

సౌదీ అరేబియాలోని మక్కాలో (భారత కాలమానం ప్రకారం) శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం సంభవించింది. మక్కా మసీదు వద్ద క్రేన్‌ కూలీ 60మందికి పైగా దుర్మరణం చెందగా, 70మందికి పైగా గాయాలపాలయ్యారు. మరొకొన్ని రోజుల్లో పవిత్ర హజ్‌ తీర్థయాత్ర ప్రారం భం కానున్న నేపథ్యంలో మసీదుకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.మృతుల్లో ఎక్కువమంది హజ్‌ యాత్రికులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రిస్క్యూ టీం సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.