మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల దీక్షకు 15 ఏళ్లు

55555మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల(43) ఆమరణ నిరాహార దీక్షకు ఇవాళ్టితో 15 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో షర్మిల 2000 నవంబరు 4న ఈ దీక్ష చేపట్టారు. ఇన్నేళ్లుగా ఆమెను పోలీసు నిర్బంధంలో ఆస్పత్రిలోనే ఉంచారు. ముక్కుద్వారా ద్రవాహారం ఇస్తున్నారు.