మద్యం మత్తులో తల్లీసోదరిపై అత్యాచారం

యువకుడిని మట్టుబెట్టిన కుటుంబ సభ్యులు

భోపాల్‌,నవంబరు19(జనం సాక్షి): ఓ యువకుడు తల్లిని మరిచాడు.. తనకు ఓ సోదరి ఉందనే స్పృహ కోల్పోయాడు.. మరదలిపై కన్నేశాడు.. ఈ ముగ్గురిపై నిత్యం అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. యువకుడి ఆగడాలు భరించలేని కుటుంబ సభ్యులే అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దటియా పోలీసు స్టేషన్‌ పరిధిలో నవంబర్‌ 11న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

24 ఏళ్ల యువకుడికి తల్లిదండ్రులు, సోదరి, తమ్ముడు, మరదలు ఉన్నారు. అయితే ఈ యువకుడు మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించిన ప్రతీసారి.. తల్లి, సోదరి, మరదలిపై అత్యాచారం చేస్తున్నాడు. యువకుడి వేధింపులు భరించలేని కుటుంబ సభ్యులు.. అతడిని చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో నవంబర్‌ 11వ తేదీన రాత్రి మద్యం మత్తులో ఉన్న యువకుడిని చంపేశారు. తమ ఇంటికి సవిూపంలో ఉన్న కొండ ప్రాంతాల్లో శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తండ్రిని పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. తమను వేధిస్తుండడంతోనే తమ కుమారుడిని చంపామని తల్లిదండ్రులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో తల్లిదండ్రులు, తమ్ముడు, మరదలిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.