మధ్యప్రదేశ్లోరెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది.
మధ్యప్రదేశ్ దారుణం జరిగింది. జాబువాలోని సేతియా అనే రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. దాదాపు 85 మందికి గాయాలయ్యాయి. రెస్టారెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మొదటి రెండో అంతస్తులు కూలిపోయాయి. దీంతో రెస్టారెంట్లో ఉన్నవారిపై శిథిలాలు పడి ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. రెస్టారెంట్ భవనం కూలి పక్క భవనాలపై పడటంతో రెండు భవనాలు పక్కకు వంగిపోయాయి. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఎంపీ హోంమంత్రి బబూలాల్ తెలిపారు.