మరణశిక్షపై స్టే ఇవ్వండి

3

– సుప్రీంను ఆశ్రయించిన మెమన్‌

– కుటుంబసభ్యులతో భేటి

దిల్లీ జులై23(జనంసాక్షి):

తనకు విధించిన మరణశిక్ష అమలుపై స్టే విధించాలని 1993 ముంబయి సీరియల్‌ పేలుళ్ల కేసులో దోషి యాకూబ్‌ మెమన్‌ (53) గురువారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన కేసులో న్యాయపరిష్కారాలు ఇంకా పూర్తిగా అయిపోలేదని, క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నానని మెమన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని మెమన్‌ చేసుకున్న దరఖాస్తును సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 21న కొట్టివేసిన సంగతి తెలిసిందే. అతన్ని ఈ నెల 30న ఉరి తీయాల్సి ఉంది.