‘మరింత నవ్వించే శక్తిని ఇవ్వమని కోరుకున్నా’

తిరుమల : ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్టు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నానని, ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతోందని, ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎంజాయి చేస్తారని బ్రహ్మానందం అన్నారు.