మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

న్యూటీల్లీ, జనంసాక్షి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. యువత మహిళా సంఘాల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతోంది. బాధితురాలి మృతిదేహం వుంచిన ఏయిమ్స్‌పరిసరాలు, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యాక్రమాలు కొనసాగుతున్నాయి. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ  ఆందోళనకారులు నినాదాలు చేస్తోన్నారు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలను పర్యవేక్షించేదుకు పోలీసు ఉన్నతాధికారులతో బారీ బందోబస్తు ఏర్నాటు చేశారు. కాగా, ఆత్యాచార ఘటనకు పాల్పడిన నిందితుడు మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.