మరో ఎన్ కౌంటర్…

vme4adkcఛత్తీస్ గఢ్ : తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని దర్భా ఘాట్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టులు కదలికలు ఉంటుండడం..వరంగల్ ఎన్ కౌంటర్..టిడిపి నేతల కిడ్నాప్ నేపథ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ ను విస్తృతం చేశాయి. ఈ తరుణంలో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.