మరో జర్నలిస్ట్‌పై కాల్పులు

పాట్నా,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరి లంకేశ్‌ బెంగళూరులో హత్యకు గురైన రెండు రోజులకే అటువంటి దారుణ ఘటనే మరొకటి బిహార్‌లోని ఆర్వాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. హిందీ డైలీ న్యూస్‌ పేపర్‌ రాష్టీయ్ర సహారాలో పంకజ్‌ మిశ్రా జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బ్యాంక్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు వెనుకనుంచి కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో అక్కడే కుప్పకూలాడు. స్థానికులు స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కాల్పులు జరిపిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.