మహంకాళి దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో మహంకాళి దేవాలయం దగ్గర సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం స్థానిక కౌన్సిలర్ చెవిటి లింగం ఆధ్వర్యంలో చేపట్టగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి-శ్రీధర్ రెడ్డి పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు పచ్చిమట్ల సతీష్ గౌడ్, ఆడెపు నరేందర్, సందుల సురేష్, కో ఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వరరావు, రైతు సమన్వయకర్త అంకుగారి శ్రీధర్ రెడ్డి, మాజీ కొమురవేల్లి దేవస్థాన చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.