మహబూబాబాద్ డిపో కు అవార్డుల వర్షం

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్7(జనంసాక్షి)

రాఖీ, శ్రావణమాస స్పెషల్ ఛాలెంజ్ లలో మహబూబాబాద్ మొదటిస్థానంలో నిలిచిందని డిపి మేనేజర్ ఎం శివ ప్రసాద్ తెలిపారు. గత డిపో మేనేజర్ విజయ్ కి టీఎస్ ఆర్టీసీ ఎండి సర్జనార్ చేతులమీదుగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో ప్రశంసా పత్రం, 10 వేల రూపాయలతో పాటు పురస్కారం అందుకున్నట్టు తెలిపారు. మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు పరిసరాల పరిశుభ్రతలో మహబూబాబాద్ డిపో ఉత్తమ బస్ స్టేషన్ విభాగంలో రెండవ స్థానంలో అవార్డ్ సాధించిందన్నారు. రాష్ట్రంలో అధిక డీజిల్ ఆదాలో మొదటి స్థానం సాధించినందుకు ప్రశంసా పత్రంతో పాటు వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని డిపో ఎస్డీఐ డ్రైవర్ సాయన్న అందుకున్నట్టు తెలిపి అవార్డులు సాధించడంలో కృషిచేసినవారికి అభినందనలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో మహబూబాబాద్ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలిచేలా అందరూ కృషి చేయాలని కోరారు