మహబూబ్‌నగర్‌లో నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని బాలానగర్‌లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు.డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.