*మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి సిందే రామోజీ*

   కొడకండ్ల,అక్టోబర్ 02 ( జనంసాక్షి )                                                                                                         మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం మహాత్ముడి కి ఇచ్చే ఘనమైన నివాళి అని టి ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ  అన్నారు..ఆదివారం టి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో   మహాత్మా గాంధీ &స్వాతంత్రసమరయోధుడు, మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి
సందర్భంగా  మహాత్మాగాంధీ   బహదూర్ శాస్త్రి  చిత్రపటాలకు పూలమాలవేసినివాళులర్పించారు.ఈ సందర్భంగా రామోజీ
మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీమహాత్ముడేనన్నారు.
సత్యం , అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల, మతవర్గ విభేదాలు లేని ఆభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలలు కనటమే కాకుండా అందుకు కృషి  చేస్తూ అమరులయ్యారన్నారు.  నేటికి ప్రపంచ వ్యాప్తంగా కోలుచుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మెన్ పేరం రాము, మండల రైతు బంధు అధ్యక్షుడు దికొండా వెంకటేశ్వరరావు,సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, స్థానిక ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి,ఏ యం సి డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి,మండల కోప్సన్ సభ్యులు యం డి నజీర్,ఎఫ్ యస్ సి యస్  వైస్ చైర్మన్ మేటి సోమరములు,పట్టణ అధ్యక్షుడు మసురం వెంకట్ నారాయణ, యస్ టి సెల్ అధ్యక్షుడు భూక్యా మగ్యా, మండల యూత్ అధ్యక్షుడు సతీష్ గౌడ్,వార్డుమేబర్స్ యం డి షన్న, కుచం హరీష్,నాయకులు దూలం సతిష్, అందే మల్లేష్, అనపురం మధు, ఎల్లయ్య, బిక్షపతి, వెంకన్న, మందుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.