మహారాష్ట్రను వణికిస్తున్న స్వైన్
ముంబై,నవంబర్1(జనంసాక్షి): మహారాష్ట్రను స్వైన్ వణికిస్తోంది. రోజురోజుకూ బాదఙతులు పెరుగుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, చలిగాలుల ప్రభావంతో మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ సైరన్ మోగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది స్వైన్ ఫ్లూ వల్ల 302 మంది మరణించారు. మరో 325 మంది ఫ్లూ బాధితులు పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు వైద్యశాఖ అధికారులు. 25 మంది రోగులకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలంటున్నారు.