మహారాష్ట్రలో ఘోర ప్రమాదం ఏడుగురు మృతి

ముంబై : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని… మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం బీడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.