మహారాష్ట్రలో రైతుల ఆందోళన ఉద్రిక్తంత
మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణ్ లో భూసేకరణను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లమీదకు వచ్చారు. థానే-బద్లాపూర్ నేషనల్ హైవేపై దిగ్భదించారు. పోలీసులు అన్నదాతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. పోలీస్ చర్యలను నిరిసిస్తూ.. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. నేవీ స్వాధీనం చేసుకున్న తమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.