మహారాష్ట్ర సర్కారు దుస్సాహసం

4
– మదరాసల గుర్తింపు రద్దు

ముంబై జులై2(జనంసాక్షి):

మదర్సాలపై  మహారాష్ట్ర ప్రభుత్వం దుస్సాహసం చేసింది.  మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు ,చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.బీఫ్‌        నిషేధాన్ని ప్రకటించి విమర్శలు మూటగట్టుకుని తాజాగా మరోహిందుత్వ ఏజెండాను అమలుకు పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి దిలీప్‌ కాంబ్లీ గురువారం నాడు ప్రకటించారు. ఇతర పాఠశాలలో చదివే విద్యార్థులను సమానంగా పరిగణించనవసరంలేదని ఆయన పేర్కోన్నారు.

మదర్సాలలో కూడా ఇతర స్కూళ్లలో మాదిరిగా మతరగతులు నిర్వహిస్తేనే నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రకటించిన విషయం తేెలిసిందే.మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కానీ అటువంటి విద్యాసంస్థల్లో మతపరమైన అంశాలు నేర్చుకునే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మదర్సాలలో కూడా సైన్స్‌, గణితం, సాంఘీకంశాస్త్రము వంటి సబ్జెక్టులు బోధించాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఏక్‌ నాథ్‌ ఖడ్సే గతంలేనే సూచించింన విషయం తెలిసిందే.