మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన

ఓజో ఫౌండేషన్ అధినేత : పిల్లుట్ల రఘు
గరిడేపల్లి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి):మండలంలోని కల్మల్ చెరువు గ్రామ పంచాయితీ పరిధిలో రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి  గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల సందర్భంగా  ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయకుడికి నవరాత్రుల సందర్భంగా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం కుల మతాలకు అతీతంగా గణపతి నవరాత్రులను అంగరంగవైభవంగా నిర్వహించడం మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమని ఆదిదేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించాలని కోరారు. నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇంచార్జి కుక్కల వెంకన్న, ఓజో ఫౌండేషన్ సభ్యులు, రైడర్స్  యూత్ కమిటి సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు భక్తులు పాల్గొన్నారు.