మహిళల న్యూడ్ పోటోస్ సర్కూలేట్ చేసే వారి పై చర్యలు తప్పవు—– జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్

గద్వాల ప్రతినిధి నవంబర్ 07 (జనంసాక్షి):- గద్వాల లో జరిగిన ఆడవారి ఫొటోస్ సర్కులేషన్ విషయములో జిల్లా ప్రజలు అందరూ విజ్ఞతతో బాధ్యత గా వ్యవహరించవలసిన అవసరం వుందని, మహిళల ఫొటోస్ ను సర్కులేట్ చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా సెల్ ద్వారా నిఘా ఉంచి గమనిస్తున్నామని అట్టివారు పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు.ఇది చాలా సున్నితమైన విషయం అయినందున మరియు ఆడవారి గౌరవం, ఆత్మాభిమానం కు భంగం కలిగించే విధంగా ఉన్నందున ఎవ్వరూ కూడా ఆషామాషీ గా తీసుకోకుండా , తమాషాగా చూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరైనా పరిధులు దాటి ప్రవర్తిస్తే చట్ట పరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు..