మహిళాశక్తి కీలకమైనది : మోడీ

న్యూఢిల్లీ : ఆధునికి భారతదేశంలో మహిళశక్తి కీలకమైనదని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్‌ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని చెప్పారు. అమ్మ అనే పిలుపులో ఎంతో కమ్మదనం ఉందన్నారు. మహిళల పట్ల అభిప్రాయాలు మార్చుకోవాలన్నారు. ఆడ పిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారని బాధపడ్డారు. సోషల్‌ మీడియా వల్ల చాలా మంది సోదరీమణులతో అభిప్రాయాలు పంచుకుంటున్నానని చెప్పారు ఫేస్‌బుక్‌, ట్విట్టర్ల ద్వారా అభిప్రాయాలు తనతో పంచుకోవాలని కోరారు.