మాజీ గవర్నర్‌, యూపి మాజీ సిఎం నారాయణ్‌దత్‌ తివారి కన్నుమూత

బర్త్‌డే రోజే కన్ను మూసిన వృద్దనేత
న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ గవర్నర్‌, యూపి  మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారి(93) గురువారం  సాయంత్రం కన్నుమూసారు.  గతేడాది సెప్టెంబర్‌ నుంచి బ్రెయిన్‌ స్టోక్ర్‌తో బాధపడుతున్న తివారి.. సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జ్వరం, న్యుమోనియాతో బాధపడుతూ మధ్యాహ్నం 2.50 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. 1925 అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారి పూర్తి పేరు నారాయణ దత్‌ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఆయన తన 93వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అస్తమయం కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగానే కాకుండా గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక వ్యక్తి ఎన్డీ తివారి. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా, ఒక్కసారి ఉత్తరాఖండ్‌ సీఎంగా పని చేశారు. 1976-77, 1984-85, 1988-89 వరకు యూపీ సీఎంగా సేవలందించారు. 2002 నుంచి 2007 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా తివారి పని చేసి గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. 2002 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా సేవలందించారు.  2007 19న ఏపీ గవర్నర్‌గా నియమితులైన తివారి 2009 డిసెంబర్‌ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్‌ రాజకీయ నాయకుడైన తివారి రెండు రాష్ట్రాలకు  ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతీయుడిగా ఘనత సాధించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ పనిచేశారు. అంతేకాకుండా పరిశ్రమలు, పెట్రోలియం శాఖలకుమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తివారి.. భారత స్వాంత్య పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. తొలుత ప్రజాసోషలిస్టు పార్టీలో పనిచేసిన తివారి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1994లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అర్జున్‌సింగ్‌తో కలిసి ఆల్‌ ఇండియా ఇందిరా కాంగ్రెస్‌ స్థాపించారు. అనంతరం సోనియా గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.