మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ రాములు

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో శుక్రవారం నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు పర్యటించి వినాయక మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండల మాజీ వైస్ ఎంపీపీ సురేష్ యాదవ్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జడ్పిటిసిల సంఘం ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు నారాయణరావు, యుగేoధర్, సర్పంచ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.