మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం

 Narendra-Modi-address-2 మంగోలియా: భారత ప్రధాని నరేంద్రమోడి మంగలోలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ.. దేశ అధ్యక్షుడు సఖీ అగిన్‌తో కాసేపటి క్రితమే భారత్‌ ప్రధాని నరేంద్ర మోడి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంగోలియా-భారత్‌ల మధ్యపలు కీలక ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. మంగలియాకు భారత్‌ తరపున 1 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమని మోడి ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుదేశాలు పరసర్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని,

మానవ సంబంధాలతోనే ఆర్ధిక బంధాలు బలోపేతం అవుతాయ‌ని

ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరికాసేపట్లో మంగోలియా పార్లమెంట్‌ను ఉద్దేశించి మోడి ప్రసంగించనున్నారు. మంగోలియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డులకెక్కారు.