మాయ మాటలు చెప్పి పెళ్లిచేసుకుని వదిలేశాడు -నాకు న్యాయం చేయాలంటూ సునీత ఆవేదన

మహబూబాబాద్ బ్యురో-అక్టోబర్7(జనంసాక్షి)

మాయమాటలు చెప్పి నమ్మించి ప్రేమిస్తున్నానని కేసముధ్రం మండలానికి చెందిన సందీప్ గౌడ్ మూడేళ్లు సహజీవనం చేసి గత మూడు నెలల కింద పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరి కులం ఒకటి కాదని వదిలేసాడని బాధితురాలు లవుడ్యా సునీత జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. నువ్వే ప్రాణమని నమ్మించి కుటుంబసభ్యులకు ఫోన్ కూడా చేసి పెళ్లి చేసుకుంటానని అడిగి నాకు నమ్మకం కల్పించి జులై నెలలో పెళ్లి కూడా చేసుకున్నాడని ఆధారాలు చూపిస్తూ యల్ హెచ్పిఎస్, మహిళా సంఘాల నాయకుల మద్దతుతో అంబెడ్కర్ ఎదుట ఆమె బాధ వెల్లభుచ్చుకుంటూ తనకు న్యాయం చేయకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సునీత డిమాండ్ చేసింది. విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని స్థానిక పోలీసులు ఇచ్చిన హామీతో ఆమెను అక్కడినుండి తరలించారు.