మార్కెట్‌లో రాజకీయ జోక్యం నివారించాలి

కడప,మే4(జ‌నంసాక్షి): పసుపు రైతులను తక్షణం ఆదుకోవాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు మార్కెట్‌ యార్డు అధికారులకు ఫోన్‌ చేసి పసుపును కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే మార్కెట్‌ యార్డులో రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు.  పసుపు నాణ్యత లేదని, పచ్చిగా ఉందని రకరకాల సాకులు చెప్పి రైతును మోసం చేస్తున్నారని విమర్శించారు. పసుపు కొనుగోలు ధరలు నిర్ణయించినా ఇందులో కూడా మార్కెట్‌ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు నాణ్యతగా లేదని అధికారుల చేత దళారులు చెప్పిస్తున్నారని విమర్శించారు. వారు ఇష్టారాజ్యంగా తక్కువ ధరలకు పసుపు కొంటున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డులో దళారీ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమే పసుపు కొనుగోలు చేయాలని కోరారు.  ల్గ/తులందరి పసుపును కొనుగోలు చేయాలని  డిమాండ్‌ చేశారు. కడప మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకువచ్చిన పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.