మార్నింగ్ వాక్ కు వెళ్తే.. కిడ్నాప్ చేసి..!

లక్నో: గుర్తు తెలియని దుండగులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోలా ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల  కథనం ప్రకారం.. బాలిక(16) బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఎవరూలేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆ మైనర్ బాలికను రేప్ చేశారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాలేదని తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.

దగ్గర్లో ఉన్న ఓ కెనాల్ ప్రాంతంలో తమ కూతురు నిస్సహాయ స్థితిలో పడి ఉందని ఆమె తండ్రి తెలిపారు. జరిగిన విషయాన్ని బాలిక తన పేరేంట్స్ కు చెప్పింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, నిందితులును ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని వివరించారు.